
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 14 వేలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. ఈ మొత్తం కేసుల్లో 812 మంది లోకల్స్ కాగా.. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు నలుగురు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 29 మంది ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనాకేసుల సంఖ్య 16,907కి చేరింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 198కి చేరింది. ఆస్పత్రుల్లో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7,313కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో 8,586 మంది చికిత్స పొందుతున్నారు.