
ఏపీలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా ప్రభావానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు సంఖ్య 3,338కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో 33 మంది రాష్ట్రంలోని వారు కాగా.. మిగతా కేసులన్నీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు. శుక్రవారం కోవిడ్ నుంచి కోలుకుని 79 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి కర్నూల్ జిల్లాలో ఈరోజు ఒకరు చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 60 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2784 కేసులలో 2037మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారు.