దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 8 వేల 582 మందికి వైరస్ సోకింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 4 వేల 143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.69శాతానికి చేరింది. దేశంలో మొత్తం యాక్టీవ్ కేసులు 0.1శాతం ఉందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. డైలీ పాజిటివిటీ రేటు 2.71శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దేశంలో టీకా కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 195 కోట్లుకు చేరుకుంది.