ఏపీలో 8732 కరోనా కేసులు.. 87 మంది మృతి

ఏపీలో 8732 కరోనా కేసులు.. 87 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య శ‌నివారం కాస్త త‌గ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8732 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,82,817కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే, రాష్ట్రంలో గత 24 గంటల్లో 87 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2562కి చేరింది.

జిల్లాల వారీగా క‌రోనా మ‌ర‌ణాలు చూస్తే..చిత్తూరు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 చొప్పున, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 7 చొప్పున, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 6 చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 5 చొప్పున, కృష్ణా జిల్లాలో 3 మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,91,117మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 10,414 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, గత 24 గంటల్లో 53,712 నామూనాలు పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 28,12,197 కరోనా పరీక్షలు నిర్వహించారు.