43 లక్షలు దాటిన కేసులు..74 వేలకు చేరువలో మరణాలు

43 లక్షలు దాటిన కేసులు..74 వేలకు చేరువలో మరణాలు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది.నిన్న ఒక్కరోజే 89,706 కొత్త కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 43,70,129కు చేరింది. మరో 1115 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 73,890కి చేరింది. 33,98,845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 8,97,394 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే 11,54,549 మందికి టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 9 వరకు దేశంలో కరోనా టెస్టులు సంఖ్య 5,18,04,677కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.