వర్షం బీభత్సం..చాంద్రాయణ గుట్టలో గోడ కూలి 9 మంది మృతి

వర్షం బీభత్సం..చాంద్రాయణ గుట్టలో గోడ కూలి 9 మంది మృతి

ఆగకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. చాంద్రాయణ గుట్ట గౌస్ నగర్ లో అర్థరాత్రి ఓ కాంపౌండ్ వాల్ కూలి ఐదు ఇండ్లపై పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. దాదాపు 25 మంది చిక్కుకున్నారు.  ఓ ఇంట్లో ఐదుగురు,ఇంకో ఇంట్లో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యయి. ఘటన స్థలానికి వచ్చిన  రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

మరో వైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై  సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్లు,ఎస్పీలు, కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడారు. జీహెచ్ఎంసీలో వర్షాలపై సీనియర్ అధికారులతో సీఎస్,డీజీపీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.