ముంబయికి మరో 900 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిసిటీ ఏసీ బస్సులు

ముంబయికి మరో 900 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిసిటీ ఏసీ బస్సులు
  • కొనుగోలుకు బెస్ట్ ఆమోదం
  • తీరనున్న ప్రయాణికుల వెతలు

ముంబయి మహా నగర వీధుల్లో మరో 900 డబల్ డెక్కర్ ఎలక్ట్రిసిటీ ఏసీ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. బస్సుల కొనుగోలుకు ముంబయి మహా నగర పాలక సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రిహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై  అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) కమిటీ ఆధ్యర్యంలో ఈ కొనుగోలు జరగనుంది. ఇప్పటికే 48 డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని అధికారులు తెలిపారు. బస్సుల కొనుగోలు కోసం బస్సు తయారీ సంస్థలను సంప్రదించామని, సప్లై చేయడానికి వారు ఒప్పుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు కష్టాలు కొంత మేరకైనా తీరనున్నాయి.  

ఇవి కూడా చదవండి..

పైపు పగిలి రోడ్డు పాలవుతున్న మంచి నీళ్లు

నెలరోజుల్లో హైకోర్టుకు కొత్త జడ్జిలు