ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. ఒక్క‌రోజే 93 మంది మృతి

ఏపీలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం.. ఒక్క‌రోజే 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ వస్తున్న‌ వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి ఒక్కరోజులోనే 93 మంది చనిపోయారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. కరోనాను జయించి వీరిలో 1,61,425 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 90,425 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,296 మంది మరణించారు.

ఈ ఒక్క‌రోజే వైర‌స్ బారిన ప‌డి‌ గుంటూరులో 13 మంది, ప్రకాశంలో 11, చిత్తూరులో 10 మంది, నెల్లూరులో పది మంది, శ్రీకాకుళంలో తొమ్మిది మంది, అనంతపురంలో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు మరణించారు.