మైనర్ల ర్యాష్ డ్రైవింగ్కు 13 ఏళ్ల బాలుడు బలి

మైనర్ల ర్యాష్ డ్రైవింగ్కు 13 ఏళ్ల బాలుడు బలి

మైనర్ల ర్యాష్ డ్రైవింగ్కు 13 ఏళ్ల బాలుడు బలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని హయత్ నగర్లో చోటుచేసుకుంది. శ్రీశాంత్ రెడ్డి అనే బాలుడు ఆదివారం సాయంత్రం సైక్లింగ్ చేస్తుండగా ఇద్దరు మైనర్లు బైక్ తో వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శ్రీశాంత్ రెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. బాలుడి తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, స్వర్ణలక్ష్మీ న్యూజిలాండ్  లో స్థిరపడ్డారు. శ్రీశాంత్ రెడ్డి కూడా న్యూజిలాండ్ లోనే పుట్టి పెరిగాడు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మీద మమకారంతో సురేందర్ రెడ్డి కొడుకుని ఇండియా తీసుకుని వచ్చారు. కన్న కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.