రవీంద్రభారతిలో నాణేలతో కేటీఆర్ చిత్రం 

రవీంద్రభారతిలో నాణేలతో కేటీఆర్ చిత్రం 

రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ నేతపై ఉన్న అభిమానాన్ని టీఆర్ఎస్ నేతలు వినూత్న రీతుల్లో తెలియజేస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణంలో నాణేలతో 30 అడుగుల కేటీఆర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంపై హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కామారెడ్డికి చెందిన అతిమాముల రామకృష్ణ మంత్రి కేటీఆర్ అభిమాని. దీంతో కేటీఆర్పై ఉన్న అభిమానంతో నాణేలతో ఆయన చిత్రం వేయించారు.హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత రంగోలీ చిత్రకారుడు విజయ్ భాస్కర్ చేతుల్లో ఈ కళాఖండం రూపుదిద్దుకుంది. కేటీఆర్ చిత్రం ఏర్పాటు చేయడానికి 40 వేల నాణేలను ఉపయోగించారు. దాదాపు 20 గంటలకుపైగా కళాకారులు శ్రమించారు. రవీంద్ర భారతి ఘంటసాల ప్రాంగణంలో వేసిన కేటీఆర్ చిత్రం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు పోటీ పడ్డారు.