- ఓవర్స్పీడే కారణం
- రామచంద్రాపురం పీఎస్పరిధిలో విషాదం
రామచంద్రాపురం, వెలుగు : రామచంద్రాపురం పీఎస్పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఓ డ్రైవర్అజాగ్రత్తగా బస్సు నడపడం వల్ల నిండుప్రాణం పోయింది. పోలీసుల కథనం ప్రకారం..ఎస్టీఎస్ట్రావెల్స్కు చెందిన బస్సు పటాన్చెరు నుంచి హైదరాబాద్వైపు అతివేగంగా వస్తూ రామచంద్రాపురం రైల్వై ట్రాక్ వద్ద అదుపు తప్పింది. పక్కనే ఉన్న ఫుట్పాత్పైకి దూసుకువెళ్లి వాకింగ్చేస్తున్న బీడీఎల్కార్మికుడు యాదయ్య (58) ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.