ఫుట్​పాత్​పైకి దూసుకెళ్లిన బస్సు బీడీఎల్ ​కార్మికుడు మృతి

ఫుట్​పాత్​పైకి దూసుకెళ్లిన బస్సు బీడీఎల్ ​కార్మికుడు మృతి
  •      ఓవర్​స్పీడే కారణం
  •     రామచంద్రాపురం పీఎస్​పరిధిలో విషాదం

రామచంద్రాపురం, వెలుగు : రామచంద్రాపురం పీఎస్​పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఓ డ్రైవర్​అజాగ్రత్తగా బస్సు నడపడం వల్ల నిండుప్రాణం పోయింది. పోలీసుల కథనం ప్రకారం..ఎస్​టీఎస్​ట్రావెల్స్​కు చెందిన బస్సు పటాన్​చెరు నుంచి హైదరాబాద్​వైపు అతివేగంగా వస్తూ రామచంద్రాపురం రైల్వై ట్రాక్​ వద్ద అదుపు తప్పింది. పక్కనే ఉన్న ఫుట్​పాత్​పైకి దూసుకువెళ్లి వాకింగ్​చేస్తున్న  బీడీఎల్​కార్మికుడు యాదయ్య (58) ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.