![సైదాబాద్లో కారు బీభత్సం..నాలుగు బైకులను ఢీకొట్టి పరార్](https://static.v6velugu.com/uploads/2024/05/a-car-hit-four-bikes-in-saidabad_jmg6y0qfDe.jpg)
హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. సైదాబాద్ జయనగర్ ప్రధాన రహదారిపై తెల్లవారుజామున నాలుగు బైకులను ఢీకొట్టింది ఇన్నోవా కారు. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల అంబులెన్స్ లో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కార్ అపకుండానే వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.