రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై ముంబైలో కేసు నమోదు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై ముంబైలో కేసు నమోదు

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబైలో కేసు నమోదయింది.  విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదయింది. జనవరి 29న ముంబైలోని ముంబై మంఘళ్ హట్ లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153ఎ 1 (ఎ) కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆ సభలో మాట్లాడిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. 

ముంబైలో చేసిన వ్యాఖ్యలకు గాను హైదరాబాద్ పోలీసులు కూడా రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చారు. పీడీయాక్ట్ కేసులో జైలుకు వెళ్లిన రాజాసింగ్.. బెయిల్ మీద విడుదలైన టైంలో తెలంగాణ హైకోర్టు.. విద్వేష పూరిత మాటలు మాట్లాడొద్దంటూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ముంబై కార్యక్రమంలో ఆ నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చి, ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరారు.