డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయిన కంటెయినర్.. నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్

డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయిన కంటెయినర్.. నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్

శంషాబాద్, వెలుగు: యూటర్న్ తీసుకునే క్రమంలో ఓ కంటెయినర్ డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన శంషాబాద్ పరిధిలోని సిద్దాంతి బస్తీ వద్ద గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగింది. కంటెయినర్ ఇరుక్కుపోవడంతో హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవేపై 2 గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వెహికల్స్​ను సిద్ధాంతి బస్తీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి సింప్లెక్స్ వైపు దారి మళ్లించారు. శంషాబాద్ రూరల్ పోలీసులు  గంటపాటు శ్రమించి క్రేన్ సాయంతో కంటెయినర్​ను పక్కకు తొలగించారు. ట్రాఫిక్​ను  క్లియర్ చేశారు.