- మానుకోట జిల్లా చిన్నగూడూరు ఎంపీడీవో ఆఫీసులో ఘటన
మరిపెడ (చిన్న గూడూరు), వెలుగు : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండల పరిషత్ ఆఫీసులో ఓ దళితుడు శుక్రవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. చిన్నగూడూరు సర్పంచ్ మల్లయ్య ఉద్దేశపూర్వకంగా ఎండీవో ఆఫీసు పక్కన ఉన్న తన చికెన్షాపు తొలగించాలని నోటీసు ఇచ్చారని వడ్లకొండ ఆదామ్ ఎంపీడీవో శ్యాంసుందర్ సమక్షంలో పెట్రోల్ పోసుకున్నాడు.
తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినని, అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని కావాలనే స్థానిక బీఆర్ఎస్ లీడర్లు నోటీస్ ఇప్పించారని ఆరోపించాడు. దీంతో ఎంపీడీవో అతడిని శాంతపరిచారు. తర్వాత సర్పంచ్ మల్లయ్య ను పిలిపించి మాట్లాడారు. షాపును నీట్ గా మెయింటెయిన్చేసుకుంటే అభ్యంతరం లేదని, టెంపరరీగా ఏర్పాటు చేసుకోవచ్చని సర్పంచ్లెటర్ ఇవ్వడంతో బాధితుడు వెళ్లిపోయాడు.