మొక్కలు నరికినందుకు రూ.50 వేలు ఫైన్

మొక్కలు నరికినందుకు రూ.50 వేలు ఫైన్

అయిజ, వెలుగు: హరితహారం మొక్కలు నరికిన వ్యక్తికి అయిజ మున్సిపల్​ ఆఫీసర్లు శుక్రవారం రూ.50 వేల ఫైన్ వేశారు. ఆఫీసర్ల వివరాల ప్రకారం.. టౌన్​లోని ఆర్ అండ్​ బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఆంధ్రప్రదేశ్.. కర్నూల్​జిల్లాకు చెందిన కార్పొరేట్ హాస్పిటల్ అడ్వర్టైజ్​మెంట్​బోర్డు ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం బోర్డు ముందు నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి అడ్వర్టైజ్​మెంట్​బోర్డును కమ్మేశాయి. ​బోర్డు కనిపించడం లేదని హాస్పిటల్​కు చెందిన రాంబాబు శుక్రవారం చెట్లను నరికి వేశాడు.  హరితహారం మొక్కలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, వాటికి జియోట్యాగింగ్​చేసి కాపాడుతోంది. చెట్ల నరికివేత విషయం తెలుసుకున్న మున్సిపల్​ఆఫీసర్లు ఆరా తీసి వ్యక్తిని గుర్తించి అతడికి రూ.50 వేల ఫైన్​వేశారు. మరోసారి ఇలాంటి పనులకు పాల్పడితే  కేసులు పెడతామని హెచ్చరించారు.