చరిత్ర చెప్పే కోట బురుజు.. దానిపై ఇరవై అడుగుల ఎత్తులో రెపరెపలాడే జెండా.. ఏడాదంతా ఎగురుతూనే ఉంటుంది. ఈ కోట బురుజు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్లో ఉంది. బురుజుకు నాలుగువైపులా అద్దుకున్న జెండాలోని మూడు రంగులు మరింత అందాన్ని తెచ్చాయి. దాదాపుగా150 ఏండ్ల కిందట నిజాం రాజులు ఈ కోట బురుజు కట్టారు.
శత్రువుల నుంచి గ్రామాన్ని కాపాడుకునేందుకు, గ్రామంలోకి కొత్తవాళ్లు ఎవరైనా వస్తే ఆ విషయం తెలుసుకునేందుకు... ఒక్కమాటలో చెప్పాలంటే నిఘా కోసం ఈ బురుజు కట్టారట. ఈ మధ్య దీనికి కొన్ని మరమ్మత్తులు చేసి రెయిలింగ్ కట్టారు. దాంతో బురుజు పైకి ఎక్కడం ఈజీ అయింది. ఈ బురుజు మీద20 అడుగుల జెండా స్తంభం ఏర్పాటుచేసి, జాతీయ జెండా ఎగరేశారు. ఇక్కడికి వెళ్లగానే ఐ లవ్ ఇండియా అంటూ అక్షరాల స్కల్ప్చర్ వెల్కం చెప్తుంది. ఊరికి స్పెషల్ అట్రాక్షన్గా మారిన కోట బురుజుపై మీరూ ఓ లుక్కేయండి.
::: గంగాధర, వెలుగు
