ప్రజాభవన్​ ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ప్రజాభవన్​ ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 687 ఫిర్యాదులు అందాయి. వాటిలో రెవెన్యూకు సంబంధించి 225, ఫుడ్, సివిల్​సప్లయ్ కు 82, హౌసింగ్ కు 59, హోంశాఖకు సంబంధించి 47, పంచాయితీ రాజ్, రూరల్​ డెవలప్​మెంట్ కు 40, ఇతర విభాగాలకు సంబంధించి 234 ఉన్నాయి. నోడల్ ఆఫీసర్​దివ్య దేవరాజన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. 

రాష్ట్రంలోని 145 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,600 మంది గెస్ట్​లెక్చరర్ల సర్వీసును పొడిగించాలని పలువురు గెస్ట్​లెక్చలర్లు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. పీరియడ్​విధానాన్ని రద్దు చేసి 12 నెలలకు కన్సాలిడేటెడ్​పే ఇవ్వాలని  డాక్టర్​కొర్రా ఈశ్వరలాల్ బృందం కోరింది. 2022లో కానిస్టేబుల్స్​గా సెలక్ట్​అయిన 170 మందికి ట్రైనింగ్​ఆర్డర్​ఇవ్వలేదని పలువురు వాపోయారు. తమను శిక్షణకు పిలిచి ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు.