వేములవాడ బైపాస్​పై.. లారీ ఢీకొని కారు పల్టీ 

వేములవాడ బైపాస్​పై.. లారీ ఢీకొని కారు పల్టీ 

వేములవాడ, వెలుగు : వేములవాడ బైపాస్​పై ముందు వెళ్తోన్న కారును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీ కొట్టింది. కరీంనగర్​ జిల్లా గంగధారకు చెందిన రామిడి జలపతి, విజయలక్ష్మి దంపతులు సిరిసిల్లకు వెళ్లి వస్తుండగా వేములవాడ పట్టణంలోని బైపాస్​ పై ఎల్ఐసీ ఆఫీస్ వద్ద వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ దాటి పల్టీ కొట్టింది. జలపతి, విజయలక్ష్మి సీట్​ బెల్ట్ ధరించడంతో స్వల్ప గాయాలతో  బయటపడ్డారు.