గొంతులో రసగుల్లా ఇరుక్కుని కూడా మనిషి చనిపోతాడా.. దేశంలో ఫస్ట్ టైం ఇలా..!

గొంతులో రసగుల్లా ఇరుక్కుని కూడా మనిషి చనిపోతాడా.. దేశంలో ఫస్ట్ టైం ఇలా..!

గొంతులో చికెన్ ముక్కలు, మటన్​ బొక్కలు ఇరుక్కొని చనిపోయాడని చాలా సందర్బాల్లో విన్నాం.. రసగుల్ల గొంతులో ఇరుక్కొని చనిపోయాడని ఎప్పుడైనా విన్నారా!  జార్ఖండ్ ఇలాంటి సంఘటనే జరిగింది. నమ్మలేకపోతున్నారా.. నిజం.. జార్ఖండ్​ రాష్ట్రంలోని జంషెడ్​ పూర్​ లో  పెళ్లి విందులో గొంతులో  రసగుల్ల  ఇరుక్కొని  చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేశంలోనే ఇది ఫస్ట్​ టైం.. 

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఒక వివాహ వేడుకలో రసగుల్లా గొంతులో ఇరుక్కోవడంతో 41 ఏళ్ల లలిత్ సింగ్ మృతి చెందాడు. లలిత్ సింగ్ శ్వాసనాళాలను ఆ తీపి పదార్థం అడ్డుకోవడంతో, ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అతను మరణించాడని వైద్యులు తెలిపారు. 

ఈ సంఘటన జంషెడ్​ పూర్​  సమీపంలోని మలియంత గ్రామంలో జరిగింది. ఇండియా టుడే జర్నలిస్ట్ అనూప్ సిన్హా నివేదిక ప్రకారం..లలిత్ మార్చి 13, 14 తేదీల రాత్రి గ్రామంలో జరిగిన ఒక పెళ్లికి హాజరయ్యాడు. ఆ పెళ్లిలో భోజనం చేస్తూ అతను గులాబ్ జామున్ కూడా తిన్నాడు. అతను ఆ మిఠాయి తిన్న వెంటనే అది అతని గొంతులో ఇరుక్కుపోయిందని సమాచారం. దీంతో అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. చుట్టుపక్కల వారు ఆ రసగుల్లాను తీయడానికి ప్రయత్నించగా, లలిత్ నేలపై కుప్పకూలిపోయాడు. అతని ముఖం పూర్తిగా పాలిపోయి, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే అతడిని సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు.

►ALSO READ | ఎవర్రా మీరంతా: నిమ్మ రసానికి గ్యాస్ బిల్లు ఏంట్రా బాబూ..!

వైద్యుల ప్రకారం..మృతుడి గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం వల్ల అతని శ్వాసమార్గం మూసుకుపోయి, తగినంత ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఎపిగ్లాటిస్  అనే ఒక రకమైన కణజాలం ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మనం మింగినప్పుడు, ఎపిగ్లాటిస్ శ్వాసనాళంపైకి ముడుచుకుని, ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కానీ ఎవరైనా రసగుల్లా, లడ్డు లేదా అన్నం ముద్ద వంటి గట్టి లేదా పెద్ద ఆహార పదార్థాన్ని చాలా వేగంగా మింగడానికి ప్రయత్నిస్తే, ఎపిగ్లాటిస్​ గొంతు వెనుక భాగంలో ఇరుక్కుపోవచ్చు..పరిస్థితి మరింత తీవ్రమైతే అది ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని లలిత్​ సింగ్​ మరణం వెనక రహస్యాన్ని చెప్పారు డాక్టర్లు.