
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ అన్నమయ్య హోటల్సమీపంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. షాద్నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్కు చెందిన మెహరాజ్ (41) స్థానికంగా గ్లాస్ వర్క్స్ చేస్తున్నాడు. గురువారం ఛాతీ నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. శుక్రవారం ఉదయానికి నొప్పి తగ్గడంతో యథావిధిగా పనిపై శంషాబాద్కు బయలుదేరాడు. బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పడిపోయాడు. స్థానికులు సమీప హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.