కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో విషాదం జరిగింది. తేనె కోసం చెట్టెక్కిన ఇద్దరికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడిక్కడే చెట్టుపై ఒకరు మృతి చెందారు. తీవ్రగాయాలైన మరొకరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చెట్టుపై నుంచి విద్యుత్ తీగల లైన్ ఉంది. చెట్టెక్కిన వారికి తీగలు తాకడంతో చెట్టుపైనే పడి ప్రాణాలు కోల్పోయారు ఒకరు. మృతుడు యద్దనపూడికి చెందిన నాగరాజుగా గుర్తించారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
