పైప్ లో ఇరుక్కొని మున్సిపల్ కార్మికుడు మృతి

పైప్ లో ఇరుక్కొని మున్సిపల్ కార్మికుడు మృతి

ఖమ్మంలో ఓ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు పైప్ లో ఇరుక్కొని మృతి చెందాడు. చిర్ర సందీప్ (23) అనే యువకుడు విధుల్లో భాగంగా.. ఖమ్మం ప్రభుత్వ నయాబజార్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో పైప్ లో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించి సందీప్ ను బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు.