Gold Rate: దూకుడు మీద ఉన్న బంగారం.. కేజీ రూ.2లక్షల 22వేలకు చేరిన వెండి..

Gold Rate: దూకుడు మీద ఉన్న బంగారం.. కేజీ రూ.2లక్షల 22వేలకు చేరిన వెండి..

Gold Price Today: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతూ అప్పుడప్పుడూ తగ్గుతున్న గోల్డ్, సిల్వర్ రేట్లు సామాన్య మధ్యతరగతి కొనుగోలుదారులను డైలమాలో పడేస్తున్నాయి. రేట్లు తగ్గుతాయని ఆగాలో లేక ఇక తగ్గేది లేదని కొనాలో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. అయితే 2025 చివరికి చేరుతున్న కొద్ది బంగారం వెండి రేట్లు విపరీతమైన ర్యాలీతో షాక్ ఇస్తున్నాయి. ఏపీ తెలంగాణ ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా రేట్లను గమనించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 16తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 17న రూ.650 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.65 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 17న):
హైదరాదాబాదులో రూ.13వేల 451
కరీంనగర్ లో రూ.13వేల 451
ఖమ్మంలో రూ.13వేల 451
నిజామాబాద్ లో రూ.13వేల 451
విజయవాడలో రూ.13వేల 451
కడపలో రూ.13వేల 451
విశాఖలో రూ.13వేల 451
నెల్లూరు రూ.13వేల 451
తిరుపతిలో రూ.13వేల 451

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 16తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 17న 10 గ్రాములకు రూ.600 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

ALSO READ : ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 17న):
హైదరాదాబాదులో రూ.12వేల 330
కరీంనగర్ లో రూ.12వేల 330
ఖమ్మంలో రూ.12వేల 330
నిజామాబాద్ లో రూ.12వేల 330
విజయవాడలో రూ.12వేల 330
కడపలో రూ.12వేల 330
విశాఖలో రూ.12వేల 330
నెల్లూరు రూ.12వేల 330
తిరుపతిలో రూ.12వేల 330

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని కొనసాగిస్తోంది. డిసెంబర్ 17న కేజీకి వెండి డిసెంబర్ 16తో పోల్చితే రూ.8వేల 900 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2 లక్షల 22వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.222 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.