నిహారిక కొణిదెల సమర్పణలో శుక్రవారం కొత్త చిత్రం ప్రారంభమైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టాడు.
నాగబాబు కెమెరా స్విచాన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని చిత్ర యూనిట్కు అందించారు. షార్ట్, ఫిలింస్, వెబ్ సిరీస్లు నిర్మించిన నిహారిక నిర్మిస్తున్న తొలి సినిమా ఇది.
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి ఈ చిత్రంలో నటిస్తున్నారు.