ఆటోలో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఆటోలో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
  • 5. 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ధూల్ పేట పోలీసులు

మెహిదీపట్నం, వెలుగు:  ఆటోలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ధూల్ పేట ఎస్ హెచ్ఓ మధుబాబు తెలిపిన ప్రకారం.. శనివారం ఉదయం 8 గంటలకు పురానాపూల్ వద్ద తనిఖీలు చేస్తుండగా ధూల్ పేటకు చెందిన సంతోష్ సింగ్ ఆటోలో 5.850 కిలోల గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇన్ స్పెక్టర్లు చంద్రశేఖర్, సీహెచ్ కోటమ్మ, సబ్ ఇన్ స్పెక్టర్ ఎం. శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు.