గండిపేట, వెలుగు: పాలమాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బైక్అదుపుతప్పి కిందపడిన ఓ యువకుడు.. పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మామిడిపల్లికి చెందిన వెంకటేశ్సోమవారం తన స్నేహితుడు కార్తీక్రెడ్డితో కలిసి బైక్పై జడ్చర్ల వైపు వెళ్తున్నాడు.
పాలమాకుల దాటాక ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వెంకటేశ్పైనుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కార్తీక్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ బ్రహ్మదేవ్ యాదవ్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
