బీరువా మీద పడి బాలుడు మృతి

బీరువా మీద పడి బాలుడు మృతి

శంషాబాద్,వెలుగు: ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బీరువా మీద పడడంతో  బాలుడు చనిపోయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్కాపురి టౌన్ షిప్ లో ఉండే కార్తిక్ అగర్వాల్, అష్మిత దంపతులకు కొడుకు రిదిద్ అగర్వాల్ (6) .  శనివారం అష్మిత బీరువాలో బట్టలు సర్దుతుంది. అక్కడికి వెళ్లి బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బీరువా అతనిపై పడింది.  రిదిద్ కు తీవ్రగాయాలు కావడంతో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.  స్థానికులు సమాచారం ఇవ్వడంతో  సెక్టార్ ఎస్ఐ రవీందర్ నాయక్ సిబ్బంది తో ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశాడు. బాలుడి డెడ్​బాడీని  పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించామని పోలీసులు తెలిపారు.