సిమ్ కొనివ్వలేదని ఆత్మహత్య

సిమ్ కొనివ్వలేదని ఆత్మహత్య

గుండాల, వెలుగు : తల్లిదండ్రులు తనకు సెల్​ఫోన్​ సిమ్ కొనివ్వలేదని ఓ కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ పంచాయతీ నర్సాపురానికి చెందిన సనప ముసలయ్య, పద్మ దంపతుల కొడుకు ప్రేమ్ సాగర్ (17) మేకలు కాస్తుంటాడు. ఇంట్లో ఉన్న మొబైల్​ఫోన్​లో యూట్యూబ్, ఫేస్​బుక్, వాట్సాప్ ​చూసేవాడు. సిగ్నల్​ లేక నెట్​ రాకపోవడంతో తల్లిదండ్రులను కొత్త సిమ్​కొనివ్వాలని అడిగాడు. ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగాడు. గుండాల సర్కార్ దవాఖానాకు, అక్కడినుంచి కొత్తగూడెం తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. గుండాల ఎస్ఐ సురేశ్​ కేసు దర్యాప్తు చేస్తున్నారు.