గుండాల, వెలుగు : తల్లిదండ్రులు తనకు సెల్ఫోన్ సిమ్ కొనివ్వలేదని ఓ కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ పంచాయతీ నర్సాపురానికి చెందిన సనప ముసలయ్య, పద్మ దంపతుల కొడుకు ప్రేమ్ సాగర్ (17) మేకలు కాస్తుంటాడు. ఇంట్లో ఉన్న మొబైల్ఫోన్లో యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ చూసేవాడు. సిగ్నల్ లేక నెట్ రాకపోవడంతో తల్లిదండ్రులను కొత్త సిమ్కొనివ్వాలని అడిగాడు. ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగాడు. గుండాల సర్కార్ దవాఖానాకు, అక్కడినుంచి కొత్తగూడెం తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. గుండాల ఎస్ఐ సురేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.