ఘట్కేసర్, వెలుగు: ఓవర్స్పీడ్తో వచ్చిన ఓ కారు.. ఆరుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. కొండాపూర్ విజ్ఞాన్ కళాశాలకు చెందిన ఉద్యోగులు సోమవారం రాత్రి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో కారు అతివేగంగా వారిపైకి దూసుకెళ్లింది. బాధితులను గాంధీ హాస్పిటల్కు తరలించారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్మద్యం మత్తులో ఉన్నాడా? లేదంటే అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
