సూసైడ్ చేసుకునేందుకు రైల్వే ట్రాక్ పైకి స్టూడెంట్ ..సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు

సూసైడ్ చేసుకునేందుకు రైల్వే ట్రాక్ పైకి  స్టూడెంట్ ..సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు

బషీర్​బాగ్, వెలుగు: సూసైడ్​ చేసుకునేందుకు రైల్వే ట్రాక్​పైకి వెళ్లిన ఓ స్టూడెంట్​ను పోలీసులు వేగంగా స్పందించి కాపాడారు. హబ్సిగూడ ఒమేగా కాలేజీలో చదువుతున్న లకన్  అనే స్టూడెంట్​ తాను సూసైడ్​ చేసుకుంటున్నట్లు ఫ్రెండ్​కు చెప్పాడు. ఆమె పోలీసులకు సమాచారమిచ్చింది. వెంటనే బ్లూ కోట్​ సిబ్బంది మొబైల్ లొకేషన్ ఆధారంగా ఖాజా గరీబ్ నగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ పై లకన్​ ఉన్నట్లు గుర్తించి నిమిషాల్లో అక్కడికి వెళ్లారు. మూర్ఛావస్థలో ఉన్న యువకుడిని కాపాడి.. ఓ హాస్పిటల్​కు తరలించారు.