పనిలో తగ్గుతున్న ఏకాగ్రత.. ధ్యాసంతా ఫోన్లు, టీవీల పైనే

పనిలో తగ్గుతున్న ఏకాగ్రత.. ధ్యాసంతా ఫోన్లు, టీవీల పైనే

ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంత మంది ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇంకొంతమంది చేసే పని మీద ఏకాగ్రత కోల్పోతారు. దీనివల్ల పనిలో తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజుల్లో చాలామంది అదేపనిగా గంటల తరబడి స్మార్ట్ ఫోన్, టీవీలను చూస్తున్నారు. దీని వల్ల వచ్చే ఫ్లాష్ లైటింగ్ మెదడుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు సైకాలజిస్టులు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పది నిమిషాల కన్నా ఎక్కువగా దేనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు.

తాజాగా స్కాట్లాండ్​కి చెందిన స్టెర్లింగ్​ యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం స్టూడెంట్స్​, ఉద్యోగులు కేవలం పది నిమిషాలు మాత్రమే ఏకాగ్రతగా ఉంటున్నారని తేలింది. పని ఒత్తిడి నుంచి రిలీఫ్​ పొందటానికి సరిగ్గా నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా ఏకాగ్రత మీద పడుతోందంటున్నారు స్టడీ చేసిన సైంటిస్టులు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

శ్వాస తీసుకోవటం

ఏకాగ్రత పెరగాలంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ గాలి పీల్చుకోవాలి. ఇది ఆరోగ్యానికి మంచి వ్యాయామం. ఇలా రోజూ కొన్ని నిమిషాలు చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే రోజూ ప్రాణాయామం చేయడం ముఖ్యం.

అవగాహన

ఏ పని చేసినా అవగాహనతో చేయాలి. మెదడుకు ప్రతి నిమిషం పని చెప్పటం చాలా అవసరం. మనసు మాట వినడం కన్నా, మెదడు మాట వినడం మంచిది. ఇలా చేయటం వల్ల ప్రతి విషయంపైనా స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అలా చేస్తే ఎమోషన్స్​ని అదుపులో ఉంచుకుంటారు. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఒక అంశంపైన అవగాహన కలిగి ఉంటారో.. అప్పుడే సరైన ఆలోచనా విధానం వస్తుంది. అలాగే పనిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది.

క్రియేటివ్​ ఆలోచనలు

ఎన్నో ఆలోచనలతో మెదడుకి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నిభారం పెరిగిపోతోంది. అందుకే వాటిలో ఇష్టమైన ఒక అంశాన్ని మాత్రమే తీసుకోవాలి. దాన్నే చాలా రకాలుగా ఆలోచించాలి. ఆ అంశం గురించి ఫ్రెండ్స్​తో చర్చించాలి. దానివల్ల క్రియేటివిటీ పెరగటంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

నిద్ర

రోజులో కనీసం ఆరు గంటలైనా ప్రశాంతంగా నిద్ర పోవాలి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర, తిండి విషయంలో కచ్చితంగా టైమ్​సెన్స్​ పాటించడం అవసరం. ఇలా చేయటం వల్ల ఏకాగ్రత పెరగటంతో పాటు చేసే పనిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. పోషకాలు ఉండేవి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీలైనంత వరకు స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి నెగెటివ్ ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుంది.