ఐదేళ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ అభీ బాకీ హై

ఐదేళ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ అభీ బాకీ హై

ఉత్తరాఖండ్ : ఐదేళ్లలో దేశంలో ఎంతో ప్రగతి జరిగిందన్నారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. దేశంలో ఇప్పుడు డెవలప్ మెంట్ వేవ్ అనేది దేశమంతటా విస్తరించిందని చెప్పారు. డెహ్రాడూన్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన గోయల్… మున్ముందు మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.

“మేం దేశంలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం భారీగా ఖర్చు చేయబోతున్నామని చెప్పాం. మౌళిక వసతుల అభివృద్ధి రంగంలో రానున్న రోజుల్లో రూ.100 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అనేది ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభీ బాకీ హై” అని సినిమాటిక్ గా సమాధానం ఇచ్చారు పియూష్ గోయల్