అల్వాల్ లో మద్యానికి బానిసై మహిళ అత్మహత్య

అల్వాల్ లో మద్యానికి బానిసై మహిళ అత్మహత్య

మద్యానికి బానిసై ఓ మహిళా అత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కానాజీగూడ అంబేద్కర్ నగర్ లో పనస పద్మ అనే మహిళ కొన్ని రోజులుగా విపరీతంగా మద్యం సేవిస్తోంది. ఈక్రమంలోనే ఆమె వింత వింతగా  ప్రవర్తించింది. దీంతో కుటుంబ సభ్యులు పరువు పోతుందని అమెను మందలించడంతో మనస్థాపానికి గురై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.