
- తాళం వేసి పరారైన క్లీనిక్ నిర్వాహకుడు
జీడిమెట్ల, వెలుగు : ఆపరేషన్ ఫెయిల్ అయి ఓ మహిళ మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అంజయ్యనగర్కి చెందిన యాదవరెడ్డి, పుష్పలత దంపతులకు ఇద్దరు సంతానం. కాగా వీరు ఫ్యామిలీ ప్లానింగ్కోసం ఇటీవల స్థానికంగా చైతన్య నర్సింగ్హోమ్క్లీనిక్ ను సంప్రదించారు. దీంతో క్లీనిక్ నిర్వాహకుడు సోమేశ్ తక్కువ ఖర్చుతో ట్రీట్ మెంట్ చేయిస్తానని దంపతులను నమ్మించాడు. నాలుగురోజుల కిందట పుష్పలతను ఆస్పత్రిలో చేర్చుకుని ఆపరేషన్ చేశారు.
3 రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలని క్లీనిక్ లోనే ఉంచారు. గురువారం ఉదయం యాదవరెడ్డికి క్లీనిక్ సిబ్బంది ఫోన్చేసి పుష్పలతకు ఆక్సిజన్అందడంలేదని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. వెంటనే వచ్చి ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పుష్పలత చనిపోయిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. చైతన్య నర్సింగ్హోమ్క్లీనిక్నిర్వాహకుడు సోమేశ్ ను అడిగేందుకు వెళ్లగా తాళం వేసి పరార్ అయ్యాడు.
దీంతో బాధిత కుటుంబసభ్యులు క్లీనిక్వద్ద ఆందోళన చేశారు. అనంతరం క్లీనిక్నిర్వాహకుడి నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయినట్టు యాదవరెడ్డి కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.