టీఆర్ఎస్​ లీడర్​తో పంచాయితీకి దిగిన మహిళ

టీఆర్ఎస్​ లీడర్​తో  పంచాయితీకి దిగిన మహిళ
  • టీఆర్ఎస్​ నేతలపై కామ్రేడ్​ల కామెంట్స్​​

‌‌యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం జై కేసారంలోని ఓ ఇంట్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్​ కార్యకర్తలతో మీటింగ్​ పెట్టారు. టీఆర్ఎస్​ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే చెప్తుండగా, ఓ లెఫ్ట్​ లీడర్​ లేచి 'మేము టీఆర్ఎస్​అభ్యర్థి గెలుపు కోసం కష్టపడుతున్నం. కిందిస్థాయికి వెళ్తున్నం. కానీ మీ వాళ్లే తిరుగతలేరు. పైపైన ఏదో తిరిగినట్టు చేస్తున్నరు. ఇట్లయితే కష్టం. మీకసలు మునుగోడులో గెలవాలని లేదా' అంటూ కామెంట్ ​చేశారు.

జై కేసారంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో ఓ మహిళ వీధిలో ఓ టీఆర్ఎస్​ లీడర్​తో పంచాయితీకి దిగారు. 'మా కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు. టీఆర్ఎస్​కు ఓటేయమని మా పార్టీ వాళ్లు చెప్పిన్రు. మా ఇంట్లో ఆరు ఓట్లున్నయి. అయినా టీఆర్ఎస్​ వాళ్లు మమ్ములను పట్టించుకుంటలేరు. మా ఇంటిని దాటి వేరే వాళ్లను కలుస్తున్నరు.' అంటూ గొడవ చేశారు. ఈ రెండు సంఘటనల టైంలో  అక్కడున్న ఇరుపార్టీల నేతలు ముక్కున వేలేసుకున్నారు.