నడి రోడ్డుపై.. బండ రాయితో కొట్టి కొట్టి చంపేశారు

నడి రోడ్డుపై.. బండ రాయితో కొట్టి కొట్టి చంపేశారు

మంచిర్యాల జిల్లాలో దారుణ్య హత్య జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తోన్న మహేష్ అనే ఓ యువకుడిని యువతితో పాటుగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు బండి రాయితో కొట్టి కొట్టి  హతమార్చారు.  జైపూర్  మండలంలోని ఇందారం గ్రామంలో జరిగిన ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపింది. 

అందరూ చూస్తుండగానే  ఈ సంఘటన జరిగినప్పటికి ఎవరూ కూడా ఆపేందుకు ముందుకు రాలేదు.  మహేష్ గతంలో తన ఇంటి ముందు నివసించే మహిళను వేధించేవాడని ఈ క్రమంలోనే మహిళ భర్త సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలుస్తోంది.  

అయినప్పటికీ మహేష్ ఆ మహిళపై వేధింపులు ఆపలేదు. పోలీస్ స్టేషన్ లో పలుమార్లు  కేసు పెట్టిన  మహేష్ వేధింపులు ఆగకపోవడంతో భరించలేకపోయిన ఆ మహిళ ఆగ్రహంతో మహేష్ ను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రాళ్లతో కొట్టి చంపేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.