ఇంట్లోకి చొరబడి అక్కాతమ్ముడిపై కత్తితో దాడి..తమ్ముడు మృతి

ఇంట్లోకి చొరబడి అక్కాతమ్ముడిపై కత్తితో దాడి..తమ్ముడు మృతి

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ఇంట్లో ఉండగా అక్కా(సంఘవి)  తమ్ముడి(పృథ్వీ)ని ఓ దుండగుడు కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తమ్ముడు మృతి చెందగా అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ పోలీసులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సంఘవి, పృధ్వీ స్వస్థలం షాద్ నగర్ కుందుర్గు...సంఘవి హోమియోపతి నాల్గో సంవత్సరం చదువుతోంది.  ప్రేమ వ్యవహారం విషయంలో  రామంతాపూర్ కు చెందిన యువకుడు  శివకుమార్ ఎల్బీ నగర్ లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకొమ్మని సంఘవిని ఒత్తిడి చేశాడు. ఇద్దరి మధ్య గొడవ అయ్యింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న తమ్ముడు పృధ్వీ అడ్డురావడంతో శివకుమార్ కత్తితో దాడి చేశాడు. తర్వాత సంఘవిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన పృధ్వీ తప్పించుకునే ప్రయత్నంలో బయటకు వెళ్లి  గేటు దగ్గర పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే  పృధ్వీ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. గాయాలైన సంఘవి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.