ఆసిఫాబాద్: ఆరుగురు వీఏవోల సస్పెన్షన్

ఆసిఫాబాద్: ఆరుగురు వీఏవోల సస్పెన్షన్

ఆసిఫాబాద్, వెలుగు: ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు వీఏవోలను సస్పెండ్ చేసినట్లు సోమవారం డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో బి.దాత్తరావు తెలిపారు. కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ మండలం వంజరి గ్రామానికి చెందిన ముర్రడి రాజేశ్వర్, మోసం గ్రామానికి చెందిన బిక్కుమై దేవన్, కొయ్యగూడకు చెందిన పోతు బీములు, గిరి, అంకుసాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సోగాల శ్రీనివాస్, గొంది గ్రామానికి చెందిన అలకం అత్రంను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

సర్​ ప్రక్రియ  పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో హెచ్చరించారు.