
దుబ్బాక, వెలుగు: అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్ కు చెందిన తుమ్మ నవీన్(29) స్థానికంగా షాపింగ్మాల్లో పని చేస్తున్నాడు. వచ్చే జీతంతో వృద్ధులైన తల్లిదండ్రులు పోషించలేక ఇటీవల అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక మనస్తాపం చెందుతున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో తన రూంలో నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు కొడుకు నవీన్ను ఎంత పిలిచినా గది తలుపులు తీయడంలేదు. పక్కింటివాళ్లతో కలిసి రూమ్ తలుపులు తెరవగా ఫ్యాన్కు ఉరేసుకుని నవీన్ చనిపోయాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.