ఫ్లై ఓవర్​పై నుంచి దూకిన యువకుడు.. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో ఘటన

ఫ్లై ఓవర్​పై నుంచి దూకిన యువకుడు.. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో ఘటన

రామచంద్రాపురం, వెలుగు: ఫ్లై ఓవర్​పై నుంచి దూకి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన పి.చంద్రప్ప(33), తల్లి వెంకటమ్మ పది రోజుల కింద తెల్లాపూర్​లో ఉండే పెద్ద కొడుకు వద్దకు వెళ్లింది. చంద్రప్ప కూడా తెల్లాపూర్​కు వస్తానని బుధవారం రాత్రి ఫోన్లో అన్నతో మాట్లాడాడు.

కాగా.. గురువారం ఉదయం 8 గంటల సమయంలో  చంద్రప్ప బీహెచ్ఈఎల్​లో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్​పై నుంచి దూకి చనిపోయాడు. అతను కొద్ది రోజులుగా అప్పుల బాధతో మనస్తాపం చెందుతున్నాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం పటాన్​చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.