కామారెడ్డి, వెలుగు : ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడి అప్పుల పాలై కామారెడ్డికి చెందిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. టౌన్ సీఐ నరహరి వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓం శాంతి కాలనీలో నివసించే వల్లందేవి గోదావరి చిన్న కొడుకు శ్రీకర్ (30) ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఏడాదిన్నరగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడి అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాడు. అయినప్పటికీ ఇంకా బాకీలు ఉన్నాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేదు. దీంతో గురువారం మధ్యాహ్నం తల్లి గోదావరి మార్కెట్కు వెళ్లగా శ్రీకర్ బెడ్ రూమ్లో ఉరేసుకున్నాడు. ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
