ఈడీని మూసేయాలని సుప్రీంకోర్టును కోరిన ఆప్​

ఈడీని మూసేయాలని సుప్రీంకోర్టును  కోరిన ఆప్​

న్యూఢిల్లీ: ఈడీ అసిస్టెంట్ ​డైరెక్టర్​పై సీబీఐ కేసు నేపథ్యంలో ఎన్​ఫోర్స్ మెంట్​ డైరెక్టరేట్​ను మూసేయాలని సుప్రీంకోర్టును ఆప్​ కోరింది. ఈడీ అసిస్టెంట్​ డైరెక్టర్​ పవన్ ​కార్తీ  మద్యం వ్యాపారి అమన్ ​దీప్​దాల్​ నుంచి రూ.5 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్​ఐఆర్ రిజిస్టర్​ చేసింది. ఈ సందర్భంగా ఆప్​ రాజ్యసభ ఎంపీ సంజయ్​సింగ్​ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎక్సైజ్​ స్కామ్​దర్యాప్తు పేరుతో ఈడీ దోచుకుంటోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు వెంటనే ఈడీని మూసేయాలని, లంచం షేర్​పై దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు.