- ఆప్ ముఖ్యనేతల సంచలన ఆరోపణ
- తమను ఓడించలేక బీజేపీ ఈ పని చేస్తోందని విమర్శలు
న్యూఢిల్లీ: ఆప్అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నవంబర్2న ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ పార్టీ ముఖ్యనేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్స్కామ్కేసులో మనీలాండరింగ్చట్టం కింద విచారణకు రావాలని సోమవారం ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చింది. స్టేట్మెంట్రికార్డు చేస్తామని విచారణకు పిలిచి కేజ్రీవాల్ ను అరెస్ట్చేసే అవకాశం ఉందని ఆప్సందేహం వ్యక్తం చేస్తోంది.
ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ముఖ్యనేతలు, మంత్రి అతిషి, సౌరభ్భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడించలేమని తెలిసే.. టాప్లీడర్లను జైలుకు పంపండం ద్వారా ఆమ్ఆద్మీ పార్టీని పూర్తిగా దెబ్బతిసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. నవంబర్2న కేజ్రీవాల్ను అరెస్ట్చేస్తే.. అవినీతి అభియోగాల కింద కాదని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకేనని తేలిపోతుందన్నారు. ‘ఆప్ రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ఎన్నికల్లో బీజేపీని ఓడించింది. కేజ్రీవాల్ను చూసి మోదీ భయపడుతున్నారు. ఎన్నికల్లో ఆప్ను ఓడించలేమని తెలిసి అరెస్టుల ద్వారా పార్టీని అంతం చేయాలని బీజేపీ భావిస్తున్నది” అని అతిషి ఆరోపించారు.
దేశంలో బీజేపీ రాజకీయంగా ఓడించలేని నేతలను దర్యాప్తు సంస్థల ద్వారా టార్గెట్చేస్తుందని విమర్శించారు. ఆప్ నేతలకు జైలుకు వెళ్లడానికి భయం లేదని, తమ చివరి శ్వాస వరకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటారని అతిషి చెప్పారు. సౌరభ్భరద్వాజ్మాట్లాడుతూ.. ‘బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేసేందుకు ప్రయత్నించినప్పుడల్లా, అది మరింత బలంగా మారుతుంది. ఆప్ తన కోసం పని చేయడం లేదు, సామాన్యుల కోసం పని చేస్తోంది’’ అని ఆయన అన్నారు.