గ్రూప్-1 రద్దుపై ఏబీవీపీ రాస్తారోకో : మనోజ్ కుమార్

గ్రూప్-1 రద్దుపై ఏబీవీపీ రాస్తారోకో : మనోజ్ కుమార్

నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గ్రూప్–1 పరీక్ష రద్దయ్యిందంటూ ఏబీవీపీ కార్యకర్తలు నిర్మల్​లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో ప్రభుత్వ శవయాత్ర పేరిట వివేకానంద చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం పేపర్ లీకులు, పరీక్షల రద్దులతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని మండిపడ్డారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్న సర్కారుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తప్పిదాలకు కారకులైన టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలను తొలగించాలన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశి, ఎస్ఎఫ్ఎస్ విభాగ్ కన్వీనర్ శివ, దినేశ్, సిద్ధు, సన్నీ, వంశీ, విగ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.