
సిద్దిపేట టౌన్, వెలుగు: ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రవణ్ బి రాజ్ మాట్లాడుతూ ఆదిత్య రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ప్రశ్నించినందుకు ఆయనపై హత్యాయత్నం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర కార్యసమితి సభ్యుడు వివేక్, రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ పవన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఫణీంద్ర, నగర కార్యదర్శులు పరుశ్రామ్, చరణ్, రాజ్, రాకేశ్, రాహుల్, వసంత్, రాజేశ్ పాల్గొన్నారు.
విద్యార్థి నాయకుడిపై దాడి సరికాదు
మెదక్టౌన్: విద్యార్థి నాయకుడిపై దాడి హేయమైన చర్య అని ఏబీవీపీ మెదక్పట్టణ కార్యదర్శి అనిల్కుమార్ అన్నారు. మంగళవారం ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..సిద్దిపేట ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్యపై దాడి చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. ఆదిత్యకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ ఏబీవీపీ నగర సహ కార్యదర్శి కార్తికేయ, నంద కిషోర్, నాగరాజు, వరుణ్ గౌడ్, మల్లికార్జున, శ్రవణ్
పాల్గొన్నారు.