కుత్బుల్లాపూర్: మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ఛైర్మన్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేదని బైఠాయించారు. హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో కొద్ది రోజులుగా పురుగులు వస్తున్నాయని చెప్తున్నా పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేడీస్ హాస్టల్ లో మగవాళ్లను సెక్యూరిటీ గార్డులుగా పెట్టీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.లక్షలాది రూపాయలు వసూలుచేస్తున్న మల్లారెడ్డి వర్శిటీ యాజమాన్యం నాణ్యమైన విద్య,భోజనం అందించకుండా విద్యార్తులను వేధిస్తున్నారని ఆరోపించారు. భోజనం సరిగ్గా లేక స్టూడెంట్స్ అస్వస్థతకు గురైన విషయం బయటకు తెలియకుండా దాస్తుందని మండిపడ్డారు.
Also Read : కవిత, జగదీష్ రెడ్డి యాదాద్రిని దోచుకున్నరు: బీర్ల ఐలయ్య
వర్శిటీ హాస్టల్ లో ఫిబ్రవరి 7న రాత్రి భోజనంలో బొద్దింక, బల్లి పడి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆందోళనకు దిగారు. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకులకు తెలియడంతో గురువారం అక్కడి నిరసన తెలిపారు. దీంతో వర్శిటీ సిబ్బంది వారిపై దాడి చేశారు.