Telangana Assembly: కవిత, జగదీష్ రెడ్డి యాదాద్రిని దోచుకున్నరు: బీర్ల ఐలయ్య

Telangana Assembly: కవిత, జగదీష్ రెడ్డి యాదాద్రిని దోచుకున్నరు: బీర్ల ఐలయ్య

ఎమ్మెల్సీ కవిత,మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యాదాద్రిని అడ్డాగా మార్చుకుని..దోచుకున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వ విప్  బీర్ల ఐర్లయ్య.   అభివృద్ధి పేరుతో 50 శాతం నిధులు  మళ్లించుకున్నారని  ఆరోపించారు.  యాదాద్రి అభివృద్ధి పేరుతో 500 మందిని రోడ్డున పడేశారు.. అందులో 15 కుటుంబాలు చనిపోయాయని చెప్పారు.  వేల కోట్లతో యాదాద్రిని నిర్మించి.. కనీస సౌలతులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. 

Also Read:మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. మరో ఇద్దరికి కూడా

ఆటో డ్రైవర్ల గురించి బీఆర్ఎస్ కు మాట్లాడే  అర్హత లేదన్నారు.  ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలంటున్న బీఆర్ఎస్ నేతలు వాళ్ల హయాంలో  యాదాద్రిపైకి ఆటోలను అనుమతివ్వ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిచ్చామని చెప్పారు. కనీస వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.