జమ్మికుంట, వెలుగు: పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద స్టూడెంట్లు సోమవారం ఆందోళన చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి దాదాపు మూడేండ్లు అవుతున్నా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు.
కనీసం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
