
కల్వకుర్తి, వెలుగు: స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసిన కల్వకుర్తి సెకండ్ ఎస్సై రామచంద్రను ఏసీబీ ఆఫీసర్లు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన నబీ వెంకటయ్యను భూ వివాదంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సెకండ్ ఎస్సై రామచంద్ర రూ. 20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో వెంకటయ్య ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో వెంకటయ్య బుధవారం ఎస్సై రామచంద్రను కలిసి రూ. 10 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రామచంద్రను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్సైని ఏసీబీ కోర్టులోహాజరుపరచనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.